తిరుమల నుండి బిగ్ అప్డేట్! 3 నెలల పాటు వాటికి బ్రేక్!
Sun Apr 20, 2025 16:25 Devotional
కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు దృష్ట్యా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటలకుపైగా సమయం పడుతోంది.
ఇది కూడా చదవండి: షాకింగ్ న్యూస్.. పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు! ఎస్సైకి సస్పెన్షన్ వేటు!
శనివారం స్వామి వారిని 78,821 మంది భక్తులు దర్శించుకున్నారు.33,568 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.
అయితే తిరమలలో పెరిగిన రద్దీ కారణంగా టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల రద్దీ అధికంగా ఉండటం వలన ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ప్రభుత్వ విభాగాల సిఫారసు లేఖలను టీటీడీ తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై టీటీడీ ముందుగా ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో భక్తులు కుటుంబ సమేతంగా సిఫారసు లేఖలతో తిరుమలకు వచ్చి ఇబ్బంది పడుతున్నారు.
ఇది కూడా చదవండి: జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
సాధారణంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏటా ఏప్రిల్ 15 నుంచి 3 నెలలపాటు సిఫారసు లేఖలను స్వీకరించరు. స్వయంగా వచ్చే VIP ప్రొటోకాల్ పరిధిలోని భక్తులకు మాత్రమే బ్రేక్ కల్పిస్తారు. అయితే ఈ విషయం తెలియకు భక్తులు సిఫారసు లేఖలతో తిరుమలకు చేరుకుని ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
అయితే వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ లో మెరుగైన వసతులు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. దీన్ని పునర్వ్యవస్థీకరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత సీఆర్ఓ కార్యకలాపాలు, అక్కడి పని చేస్తున్న సిబ్బంది, ఇతర అంశాలపై కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. భక్తుల రాకపోకలను సులభతరం చేయడం, అక్కడున్న పరిమిత స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం, సీఆర్ఓ, పీఏసీ 1 ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై నిర్ణయానికి వచ్చారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
మంత్రితో పాటు పార్టీ నేతలకు తప్పిన ప్రమాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే..
ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!
వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..
తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!
బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!
అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!
మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!
బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!
వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Andhrapradesh #Tirumala #VIPDarshan #TTDUpdates #RecommendationBan #TempleRules #TirumalaNews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.